అయ్య బాబోయ్..


Heatwave_PTI_0_0

ఈ వేసవికే జనం ఇలా పిట్టల్లా రాలిపోతూ అల్లల్లాడుతుంటే ఇంక రాబోయే రోజులు అసలు మనం ఈ తెలుగు నేలపై మనగలమా? ఉత్తరాంధ్రా అంతా ప్రకృతి సిధ్దమైన బీలభూములను కొల్లగొట్టి బొగ్గు కుంపటిగా మార్చుతూ, తడ నుండి ఇచ్చాపురం వరకు  తీర ప్రాంత ఇసుకతో ప్రమాదకరమైన లోతువరకు తవ్వి సిలికాన్ ఫ్యాక్టరీల నిర్మాణం, ఇటు రాష్ట్ర రాజధాని నిర్మాణం పేరుతో లక్షల ఎకరాల పంట పొలాలలో కాంక్రీట్ నగర నిర్మాణం, గుండెలపై కుంపటి లాంటి  అణువిద్యుత్ కేంద్రం నిర్మాణం ఈ నేలను ఎడారిగా మార్చేందుకు  ఇంకెంత కాలం పట్టదు కదా?  రెడీ టు డై..

పతకాలకు మరీ యింత భారీ నజరానాలా?


ఇటీవల తెలంగాణా సి.ఎమ్. గారు సానియా మీర్జాను తమ బ్రాండ్ (ఇదేమిటో కొత్త మార్కు) అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రకటిస్తూ కోటి రూపాయలు తన శిక్షణ కోసం ప్రకటించారు. అలాగే ఇటీవల ముగిసిన యూ.ఎస్. ఓపెన్ చాంపియన్షిప్ లో పెద్దగా పేరులేని మిక్స్ డ్ డబుల్ టైటిల్ సాధించిందని మరో కోటి రూపాయలు ప్రకటించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా (ఇదీ ఇప్పుడు ప్రియమైపోయింది) తమ బాబు జేబులో కన్నమేసి ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. తాను తెలంగాణాను ఏలిన నైజామ్ వారసుడుగా అనుకుంటున్నారా సార్ వాడు. అసలు వ్యక్తిగత క్రీడాకారులకు అసలు ఈ క్రీడలకు ఇంతింత సొమ్ము దొబ్బ పెట్టడం అవసరమా? దానివలన ఏమైనా ఉత్పత్తి జరిగి నలుగురికి తిండి పెట్టేదుందా? నిజానికి మన గ్రామీణ క్రీడాకారులకు అసలు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయా? ఎంతో మంది వాలీబాల్, కబడ్డీ మొ.న ఆటగాళ్ళు తమ వ్యక్తిగత ప్రతిభతో పతకాలు సాధించాక చదువుతో పాటు మెరిట్ సర్టిఫికేట్ చూపి ఉద్యోగాలలో వాటా పొందుతారు. లేని వాళ్ళు ఏ హోటళ్ళలోనో సర్వర్ లుగా బతుకీడ్చే వాళ్ళే ఎక్కువ. అసలు పాఠశాల స్థాయిలో వ్యాయామ అంశాలకు ఏమాత్రం ప్రాధాన్యం యిస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వీటిని ప్రోత్సహిస్తే సరిపోతుంది. అంతే కానీ యిలా ఖరీదైన స్థలాలు డబ్బు ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా ధారపోస్తుంటే అంతా నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప ఎవరూ వాటిని ఖండించడం లేదు. దానివలన వచ్చే కీర్తి ఎవరి భుజాలకు చేరుతుంది. వీళ్ళకి రక రకాల పేర్లతో బిరుదులు ఈ మద్య భారత రత్నలు ఇస్తున్నారు. ఇదంతా అనవసర ఆర్భాటం. క్రీడలు వ్యక్తిగత దారుఢ్యానికి తప్ప వాటి వలన ఒరిగేదేమీ వుండదు. ప్రజల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీసే క్రికెట్ ప్రసారాలు నిషేధించాల్సిన అవసరమెంతైనా వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కానీ ఈ సానియా మానియా మన నాయకుడికి ఎందుకో యింతన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక…

జయము జయము మారాజా!!



Brahmi

మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రజాస్వామికంగా వుంటారు. రాజధాని ఏర్పాటు నిర్మాణాల గురించి దేశ విదేశీ ప్రతినిధులతో చర్చిస్తారు కానీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు మేధావులతో చర్చించరు. జయము జయము మారాజా!!

మీది మా దొడ్డ మనసు!!

మీరే చిరకాలం మమ్మల్నేలి తరించండి పెబూ!!

పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట?


అసలీ బ్రాండ్ ఎంబాసిడర్ లేంటీ. ఇదేమైనా కంపెనీ వ్యాపారమా? లేక IPL బేరమా? రాష్ట్రాలను ప్రజల ఆస్తిగా చూడరా వీళ్ళు. వ్యాపార కేంద్రాలుగా మార్చేసి అమ్మి పార దొబ్బుతారా? జనంకోసమే మా ఉద్యమం జనం కోసమే ఇదంతా అని ఇప్పుడిలా కోట్లాది రూపాయలు వీళ్ళ బాబు సంపాదించిందాంట్లోంచి ఇచ్చినట్లు నజరానాల రూపంలో ఇస్తూ ఫోజులు కొడుతుంటే వీళ్ళ చుట్టూ చేరి భజనలా? మీ ….మ్మా? బూతులొస్తున్నాయిరా చూస్తుంటే. జనం రోజూ ఏదో ఒక కారణంతో చస్తూ బతుకుతుంటే మీ వేషాలిలా. తన ముడ్డి కాకపోతే కాశీ దాకా డేకమన్నాడంట ఎవడో? అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు జనం సొమ్ము మీ ప్రచారార్భాటాలకు ఖర్చు పెడతారా? చేవ చచ్చిన ఆటగాళ్ళకి కోట్ల రూపాయలా? వర్షం పడితే కారి దొబ్బే బడికి పైకప్పు బాగు చేయించండిరా అంటే సవాలక్ష సాకులతో రూపాయి విదిల్చని మీరు ఇలా చేయడం భావ్యమ? పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట? జనం యిలా వున్నంత కాలం మీ గారడీ చెల్లుబాటవుతుందనా? ఛీ..

నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?


నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?

కాన్వెంటు చదువులకాశపడి ఇంత మందిని చేజేతులా చంపుకుంటున్నాం.
రైలు వస్తుందని అరిచి ఏడ్చినా బస్సునాపని డ్రైవర్ ది తప్పా? కాపలా లేని లెవెల్ క్రాసింగులను పట్టించుకోని ప్రభుత్వానిది తప్పా? ఊళ్ళో వున్న సర్కారీ బడులలో కనీసం ప్రాధమిక విద్య వరకైనా చదివించే ఓపిక లేని తల్లిదండ్రులదా? వారి మీద పడి శోకాలు తీసి మూర్చిల్లితే వారు మరల చిగురిస్తారా? ఎక్స్ గ్రేషియా ఎన్ని లక్షలిచ్చినా వారి ఊపిరి మరల పోసుకుంటుందా? ఆ ఇంట చిదిమిన దీపం మరల వెలుగుతుందా? అంతెత్తు ఎగిరిపడి కిలోమీటరుకు పైగా రైలు మహమ్మారి ఈడ్చుకు పోతుంటే వారి ఊపిరి తిత్తులు పగిలి గుండె చిద్రమై నెత్తుటి ముద్దలుగా మారిన ఈ భయ విహ్వల దృశ్యం మన మనసులనుండి చెరిగిపోతుందా? ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఇలా జరిగి వుండాల్సింది కాదు, అలా చేసి వుండాల్సింది కాదు అనే ఈ నాయకులను అధికారులను ఎవరమూ నిలదీయలేమా? ఇంత ఘోర దృశ్యాన్ని మరల మరల మనం చూడవలసినదేనా? బతికున్న శవాలుగా ఈడ్వబడాల్సిందేనా?

పిల్లలూ మా తప్పులకు మా నోట్లో ఉచ్చబోయండి…ఏరగండిరా.. అయినా ఏం లాభం….

అనవసరమైన హైప్ ఎందుకు బాబు?


సీమాంధ్ర ప్రజల పట్ల నిజమైన ప్రేమాభిమానాలు వుంటే చంద్రబాబు హైదరాబాద్ రాజధానిలోనే పాలన సాగించి అక్కడున్న సెట్లర్సుకు భరోసాగా వుండేవాడు. విజయవాడ-గుంటూరు మద్య వున్న తన కులపోళ్ళ భూములకు రియల్ బూం కల్పించేందుకే ఈ రెండిళ్ళ సిద్ధాంతం చెప్తున్నాడు.

ఈయన అటూ ఇటూ టూర్లకు అధికార్లు పడే ఆయాసం పాలన మరింత కుంటుపడుతుంది. ఈయన ఢిల్లీ యాత్రలకు రెండిళ్ళ కాపురానికి ఇప్పటికే అప్పుల ఊబిలో లోటు బడ్జెట్లో వున్న సీమాంధ్ర నెత్తిమీద ఈ తాటికాయ పడి మరింత భారమై కుంగిపోతుంది. ఈయన గారికి ఈయన మంత్రులకయ్యే రక్షణ వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. ఇదంతా అవసరమా?

మీ మీ ప్రచారార్భాటాలను కొద్ది కాలం ఆపండిరా బాబులు.

 

సి.ఏం.ప్రమాణస్వీకారానికి ప్రధాని రావడమేంటి. వచ్చి ఆ గౌరవాన్ని మంటగలుపుతారో లేదో చూడాలి.

అనవసరమైన హైప్ ఎందుకో?

అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?


tribal

dongria1_screen

అభివృద్ధి అంటే బుల్ డోజర్ తో ఖాళీ చేయించడమేనా?

పక్కింటి వాడి పాదు పాకితేనే ఇల్లు పీకి పందిరేసే నాయాళ్ళంతా వాళ్ళు ఆదివాసులు కాబట్టి నోరు లేని వారని వారి తరపున నిలిచి పోరాడే వారు వుండరన్న ధైర్యంతో ఇలా వారిని ప్రతి చోటా ముంచే పధకాలు వేస్తున్నారు. గుజరాత్లో నర్మదా ప్రాజెక్టు కట్టిన వాడే ఏలికగా వచ్చాడు కాబట్టి వీళ్ళ పాచికలిలా పారుతున్నాయి.

హింస గురించి మాటాడే వారికి ఇందులో హింస కనబడదు. మీరు గుళ్ళోకెల్తే చెప్పులు పోతేనే నెత్తీ నోరు బాదుకుంటారురా? మరి వారికి ఉన్న ఆ కాసింత స్థలాన్ని కూడా ముంచేసి వాళ్ళని వాళ్ళ సంస్కృతిని మీ నీళ్ళలో ముంచేస్తే వాళ్ళెంత బాధ పడతారు. పోలవరం వారికి శాపవరం దుఃఖవరం అవుతున్నది.

పోలవరం వెనక వున్న బహుళ జాతి కంపెనీల అవసరాల కుట్రను గ్రహించండి. ఇది తెలంగాణా సీమాంధ్ర వారి పట్టుదలలకో వైషమ్యాలకో పోయే సమయం కాదు. విలువైన సహజ వనరులు, అటవీ సంపద ఈ నీళ్ళలో మునిగి భవిష్యత్ తరం పర్యావరణ ముప్పు బారిన పడే ప్రమాదం గ్రహించండి. ఇప్పటికె భూకంపాలకు, సముద్రాగ్రహానికి దగ్గరగా జరుగుతున్నం. భారీ ప్రాజెక్టుల బారిన పడి కూచున్న కొమ్మను నరుక్కునే మూర్ఖత్వానికి పోవద్దు.

ఏలికల వ్యాపార కుట్రలను బహిర్గతం చేయండి. వారి వారి కులాల పెట్టుబడిదారులు భూస్వాముల తొత్తులయి యిలాంటి ప్రాజెక్టులను తెస్తున్నారు. నిర్వాసితుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరిస్తున్నారో మన కళ్ళముందే అనేక ఉదాహరణలున్నాయి.

ఇది ఒక్క ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. మన జీవన్మరణ సమస్యకూడా.

ఓ మానవతా మూర్తులారా మీ కళ్ళకు గట్టిన అభివృద్ధి గంతలూడదీయండి.

సత్తిబావ్ ఏటైపోతాడేటప్పా…


చిత్రం

అప్పోలప్పా ఎంకటప్పా ఈ రోజంతా టీవీ సూసేసినానే. మజ్జాన్నం వన్నం తిన్నేల్లకి అటూ ఇటూ ఎవులేలతారో తేలిపోనాదే అప్పా. నువ్వా బస్ దిగి వచ్చేటేలప్పటికి అంతా సద్దుమణిగిపోయినాది. అప్పా ఏ మాటకా మాట సెప్పుకోవాల.  ఇలపింటి తీరుపు నేనెప్పుడు సూడనేదప్పా. మన సత్తిబావ్ ఏటి పదవినేకపోవడమేటి. ఇంట్లో ఒక్క తమ్ముడూ బామ్మర్ది పెళ్ళామూ గెలవకపోవడమేటి. ఎన్నెన్ని పంచీసినాడప్పా నాలుగోట్లుంటే ఇన్వెర్టర్లంట ఎల్ సీడీలంట, పది దాటి ఓట్లున్నోళ్ళకి పల్సర్ బళ్ళంట. సినిమాల్దీసిన లాబమూ, మందమ్మిన లాబమో కానీ పంచి పెట్టీసినాడనుకో. అబ్బో బావ్ వత్తే జనమే జనం. బావు దళసరి నాలుకతోటి మాటాడుతుంటే ఈలలే ఈలలూ. అయినా కానీ అప్పా  సొమ్ములూ పోయి పదవీ రాకపోతే బావ్ ఏటైపోతాడోనని బెంగొట్టుకున్నాదప్పా. 

అదేట్నేదునేయే రాములప్పా!  మనోడు సిన్నోడా సిటికోడనుకున్నావేటి. అటు మన కాపోడేనట  పవన్ బాబు బాబు పంచనే వున్నాడుకదా. ఆడితోని సినిమాలు తీసి యింత గడించినాడుగందా. మనోడికేటి రాజకీయం యిరామం దీసుకున్నా  మందాపారం సినిమా యాపారాలున్నాయి కదేటి. మరేటి పర్నేదప్పా, పదా నాకీ బస్సులబడి వచ్చేసరికి నడుం పీకుతున్నాదీ. నీకూ టీవీ జూసీ జూసీ కళ్ళు లాగేసినాయి. యింత ముద్ద దిని తొంగుందాం. 

ఆప్కో వస్త్రాలను కొందాం..


apco_logo-------final_0
ఈ రోజు సాయంత్రం విజయనగరంలో గంటస్తంభం దగ్గర్లోని ఆప్కో వారి షాపులో దుప్పటి, తువాలు, లుంగీ కొన్నాను. బిల్ చెల్లించే సమయంలో సేల్స్ మేనేజర్ థాంక్సండీ అంటూ సార్ మీరిలా కొనడం ద్వారా చేనేత కుటుంబాలను ఆదుకొన్న వారవుతారు. మాకైతే ఉద్యోగాలున్నాయి జీతాలు వస్తాయి కానీ ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు తాము శ్రమపడి నేసిన బట్టలు అమ్మబడడం ద్వారా తిండి దొరుకుతుంది. మీకు మరో మారు నమస్కారమంటూ తను కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం చూసిన మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తప్పకుండా మళ్ళీ వస్తామని మా ఫ్రెండ్ నేను వచ్చాం భారమైన మనసుతో.

మిత్రులారా..
దయచేసి ఆప్కో వారి వస్త్రాలను వీలున్నంత మేర వాడడానికి ముందుకు వచ్చి చేనేత కార్మికులను ఆదుకొనే ఉడతా సాయం చేయగలరని మనవి. ఈ వస్త్రాలు చాలా మన్నికైనవి కూడా.

చేనేత వస్త్రాలను కొందాం. చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుందాం.

భారతరత్నమా నువ్వింత చీపా??


ఈ దేశ అత్యున్నత పద్మా అవార్డు భారత రత్న నిన్న మరికొద్ది నెలలో ముగిసిపోతున్న ప్రధాని సలహాదారుకు నిన్నటి వరకు ఆడి రిటైర్ అవుతున్న సచిన్ కు ప్రకటించారు. ఆ శాస్త్ర సాంకేతిక సలహాదారు ఏం సలహాలిచ్చారో కానీ ప్రధాని గారు తనకెక్కడా మసి అంటలేదని సర్ఫ్ ఎక్సెల్ ఏడ్ లా మాటి మాటికి ప్రకటించుకొని అప్పుడప్పుడు తమ కాళ్ళకు అడ్డం పడుతున్న తమ కుక్క పిల్ల సిబిఐ, కాగ్ లపై ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు ఈమద్య.

యింక క్రికెట్ అన్న జెంటిల్ మెన్ క్రీడను చెడ్డీలతో డాన్సులు చేసి బెట్టింగు వ్యాపారాలకు హద్దులు చెరిపేసి ఫిక్సింగ్ లతో పరువు పోయిన క్రీడగా మార్చిన శుభ తరుణంలో వున్న ఆ క్రీడాకారునికి ఈ రత్నాన్ని అలంకరించడం నాకు నచ్చలేదు. అలా అని ఈ రత్నాలు అలంకరించబడ్డ వారందరు గొప్పోళ్ళనీ ఒప్పుకోలేను.

హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్, ఒలింపిక్ వీరులు మిల్కాసింగ్, పి.టి.ఉష లాంటి వారు ఈయనకంటే మిన్న కాదా?

వీటికి రాజకీయపు నిరోధ్ లు తొడగబడుతున్న ఈ సమయంలో మరింతగా అంతా ఆహా ఓహో అని మీడియా అంతా తెగ గగ్గోలు పెట్టేస్తూ వుండడం యిదంతా ఆ క్రీడ ద్వారా లబ్ధిపొందుతున్న చానళ్ళు, తమ సమస్యలకంటే గెలుపోటములపైనే దృష్టి మళ్ళించే యిటువంటి వాటిని ప్రచారం చేయడంలో ముందుండే రాజకీయ పార్టీలు వీళ్ళకు కొమ్ము కాయడం మనం వంతపాడడం దురదృష్టకరం.